ఐటీ పితామహున్ని అని చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ లో ద్వితీయ శ్రేణి నగరాలలో ఐటీ సేవలను విస్తృతం చేసి తద్వారా ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఖర్చులు తగ్గించి, ఆ నగరాలను కూడా అభివృద్ధి చేయాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు విజయవాడ , విశాఖపట్టణం లో ఐటీ/ఐటీఈఎస్ సెజ్ లను తెస్తే అప్పట్లో గగ్గోలు పెట్టిన మీరు ఈరోజు ఎం చేస్తున్నారు ??
రాజశేఖర రెడ్డి గారి హయం లో ప్రారంభం అయ్యి నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలను చూపి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానిస్తే మంచిదే, కానీ ఆ భవనాలను మీరు ఈ మూడేళ్ళలో కట్టినట్టు కలరింగ్ ఇవ్వడం బాగాలేదు. ఎవ్వరికి తెలియదులే, నేను తప్ప అందరు అజ్ఞానులు అనుకుంటున్నారా ?? మీరు కట్టినట్టు కలరింగ్ ఇచ్చుకునే సైబర్ టవర్ ముందు మేధా ఐటీ సెజ్ భవనాలను హోర్డింగ్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ కు ఐటీ ని తెచ్చానని చెప్పుకోదలుచుకున్నారా ??
విజయవాడ లో గన్నవరం దగ్గర మేధా ఐటీ సెజ్, విశాఖపట్టణం లో ఐటీ/ఐటీఈఎస్ సెజ్ లు కట్టి, విశాఖపట్టణం నుండి కార్యకలాపాలను సైతం ప్రారంభం అయ్యాయి రాష్ట్రము విడిపోకముందే. విశాఖపట్టణం లో విప్రో, టెక్ మహేంద్ర, టిసిఎస్ వంటి కంపెనీ లు, ఇంకా చిన్న చిన్న కంపెనీ లు కార్యకలాపాలను ప్రారంభించాయి కూడా.
మీరు 2014 లో ముఖ్యమంత్రి అవ్వకముందు విశాఖ సెజ్ ల నుండి జరిగిన ఎక్సపోర్ట్స్, పెట్టుబడుల వివరాలు చూస్కోండి. మీరు దయాలను చుస్తే దాగవు నిజాలు, మీ యెల్లో మీడియా కి దీటుగా సోషల్ మీడియా కుడా ఉంది.
ఇన్ని సమ్మిట్ లు, పర్యటన లు చేస్తున్నారు కదా, మీరు ఇందులో సగం మందికైనా మీ హయం లో ఉద్యోగాలు ఇవ్వగలిగారా ??
విశాఖ సెజ్ ల ద్వారా రాజశేఖర్ రెడ్డి గారి హయం లో జరిగిన అభివృద్ధి, ఉద్యోగ కల్పన వివరాలను చూడొచ్చు. ఇవన్నీ నేను ఎక్సెల్ లో ఎంటర్ చేసి లెక్క కట్టలేదు, విశాఖ సెజ్ అధికారిక వెబ్సైటు నుండి సేకరించినవే.


Comments
Post a Comment