హంద్రీ - నీవా ప్రాజెక్ట్ ఫేస్-1 లో శ్రీశైలం నుండి జీడిపల్లి వరకు, ఫేస్-2 జీడిపల్లి నుండి అడవిపల్లి రిజర్వాయర్ వరకు తీస్కొని కర్నూల్, అనంతపురం, వైయస్సాఆర్, చిత్తూరు జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 50 లక్షల మందికి త్రాగునీరు కోసం 40టిఎంసి లతో మొదట ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తీసుకుంటే, చంద్రబాబు దాన్ని 5 టిఎంసి లకి కుదించి ఇది కేవలం త్రాగునీరుకే అని జీవో ఇచ్చాడు. వైయస్సాఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇదే హంద్రీ - నీవా ను మళ్ళీ 40 టిఎంసి లకు పెంచి పనులు వేగవంతం చేసి 2004 జులై లో 1307 కోట్ల( జీవో : 73, 24/07/2004) తో చేపట్టి ప్రాజెక్ట్ ని ఇంకా ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా రీడిజైన్ చేపించి 2007 మార్చ్ లో 2774 కోట్లతో(జీవో 2, 1/3/2007) తీసుకోవడం జరిగింది. ఫేస్ - 1 కింద కర్నూల్ జిల్లా శ్రీశైలం నుండి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు మొత్తం మూడు రిజర్వాయర్ లతో (క్రిష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి) మెయిన్ కెనాల్ తో పాటు డిస్ట్రిబ్యూటరీ లు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో మొత్తం 14టిఎంసిలను కృష్ణ నది నుండి తీసుకుంటారు. దీనిద్వారా 1,98,000 ఎకరాల ఆయకట్టు, 10లక్షల మందికి త్రాగునీరు. దేనిలో మొత్...