Skip to main content

Posts

Showing posts from September, 2017

Indira Sagar Polavaram project Facts

స్వాతంత్ర కాలంలో రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని పేరు తో సమగ్ర నమూనా ప్రచురించి దాదాపుగా 70 ఏళ్ళు కావస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు అంటే ఎంత దుర్భాగ్యమైన స్థాయిలో మన నాయకుల పాలనా ఉందొ తెలుస్తుంది , దీని స్థిగతులపైనా పైన మేము మీకు కొన్ని విషయాలు తెలియజేయడం కోసం ఈ విశ్లేషణలు .. 1947 సమయంలో 129 కోట్లు రూపాయల అంచనా వ్యయం గా భావించిన ప్రాజెక్ట్  ఇపుడు దాదాపుగా 20000 కోట్లు పై మాటే, 30 ఏళ్ల తరువాత 1980 లో టి అంజయ్య  గారు ముఖ్యమంత్రి గా నిర్మాణ పాలక వేసాడు కానీ పనులు , ప్రాజెక్ట్ నిర్మాణాకి సంబందించిన అనుమతులు తీసుకురాలేకపోయాడు. మళ్ళి 25 సంవత్సరాల తరువాత 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ పనులకు కూడా శ్రీకారం పోసి మరియు ప్రాజెక్ట్ సంబందించిన అన్ని అనుమతులు  అయన దేహం విడిచేలోపు తీసుకువచ్చి పోలవరం కి ప్రాణం పోసాడు . పోలవరం ప్రాజెక్ట్ గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన వివరాలను బట్టి ఈ ప్రాజెక్ట్ ఇదే విధంగా సాగితే మరో 20 ఏళ్లకు కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదు !! మేము చెప్పే ప్రతిఒక్కదానికి అధరాలు ఇస్తున్నాము. 2014 రాష్ట్ర విభజన బిల్లు ...

Handri - Neeva YSR Aim to give water to Rayalaseema

హంద్రీ - నీవా ప్రాజెక్ట్ ఫేస్-1 లో శ్రీశైలం నుండి జీడిపల్లి వరకు, ఫేస్-2 జీడిపల్లి నుండి అడవిపల్లి రిజర్వాయర్ వరకు తీస్కొని కర్నూల్, అనంతపురం, వైయస్సాఆర్, చిత్తూరు జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 50 లక్షల మందికి త్రాగునీరు కోసం 40టిఎంసి లతో మొదట ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తీసుకుంటే, చంద్రబాబు దాన్ని 5 టిఎంసి లకి కుదించి ఇది కేవలం త్రాగునీరుకే అని జీవో ఇచ్చాడు. వైయస్సాఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇదే హంద్రీ - నీవా ను మళ్ళీ 40 టిఎంసి లకు పెంచి పనులు వేగవంతం చేసి 2004 జులై లో 1307 కోట్ల( జీవో : 73, 24/07/2004) తో చేపట్టి ప్రాజెక్ట్ ని ఇంకా ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా రీడిజైన్ చేపించి 2007 మార్చ్ లో 2774 కోట్లతో(జీవో 2, 1/3/2007) తీసుకోవడం జరిగింది. ఫేస్ - 1 కింద కర్నూల్ జిల్లా శ్రీశైలం నుండి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు మొత్తం మూడు రిజర్వాయర్ లతో (క్రిష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి) మెయిన్ కెనాల్ తో పాటు డిస్ట్రిబ్యూటరీ లు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో మొత్తం 14టిఎంసిలను కృష్ణ నది నుండి తీసుకుంటారు. దీనిద్వారా 1,98,000 ఎకరాల ఆయకట్టు, 10లక్షల మందికి త్రాగునీరు. దేనిలో మొత్...